తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు హీరోలు, దర్శకులు, నిర్మాతల తనయులు వారసత్వపు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్లు మాత్రం ఎవ్వరూ రాలేదు. మొదటి సారిగా మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న అది సాద్యం కాలేదు..కాకపోతే ఇండస్ట్రీలో మంచి నటిగా రాణిస్తుంది. అంతే కాదు బుల్లితెరపై యాంకర్ గా కూడా తన సత్తా చాటుతుంది మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి బాటలోనే నడుస్తూ..మెగాబ్రదర్ నాగబాబు తనయ కొణిదెల నిహారిక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూసింది.
కాకపోతే డైరెక్ట్ గా కాకుండా బుల్లితెరపై ‘ఢీ’ డ్యాన్స్ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నిహారిక బుల్లితెరపై యాంకర్ గా బాగా ఆకట్టుకుంది. ఇక నాగశౌర్య హీరోగా ‘ఒకమనసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకపోతే ఈ సినిమా విజయం మాత్రం సాధించలేదు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల నిహారిక హ్యపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. లక్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.
సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్స్గా తెరకెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందినట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కానీ ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ ఇస్తూ..సంగీత దర్శకుడి వివరాలతో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించనున్నట్టు ప్రకటించింది.
శక్తికాంత్ కార్తీక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ మరియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు. ఇక నిహారిక ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ అనే టైటిల్తో రూపొందుతున్న తమిళ చిత్రంలోను నటిస్తుంది.