కింగ్ ఖాన్ షారూఖ్, క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం జీరో . రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. 2018 డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షారూఖ్ సరసన అనుష్మ శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
2012లో వచ్చిన జబ్ తక్ హై జాన్ చిత్రంలో అలరించగా, ఇప్పుడు జీరో కోసం మరోసారి జతకట్టారు. రంజాన్ సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపారు. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అదిరిపోయే రంజాన్ గిఫ్ట్ ఇచ్చారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్తో కలసి సందడి చేశారు. ఆయన సంకనెక్కడమే కాకుండా ముద్దుపెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.
శుక్రవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సినిమా ప్రత్యేక టీజర్ను షారుక్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్లో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. షారుక్, సల్మాన్ కలిసి ఆడిపాడిన టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈద్ సందర్భంగా ఇద్దరు సోదరులు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటూ టీజర్ను ముగించారు.
షారుక్పై అభిమానంతోనే ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నానని సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చాలా కాలం తరవాత షారుక్, సల్మాన్ కలిసి వెండితెరపై కనిపించనుండంతో సాధారణంగానే ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. దీనికి తోడు షారుక్ మరగుజ్జు మనిషిగా కనిపిస్తుండటం మరో ప్రత్యేకత. ప్రస్తుతం జిరో ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.