ఈ మద్య సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు రూమర్లు సృష్టిస్తూ జనాలను కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు.  ముఖ్యంగా సెలబ్రెటీల గురించి వచ్చే రూమర్లకు అంతే లేకుండా పోయింది.  తాజాగా టాలీవుడ్ లో మహిళా నటుల ఫొటోలు పెట్టి, వారితో గడిపేందుకు వెలకట్టి, పోలీసులకు చిక్కిన చొక్కారపు గణేష్ అనే మాజీ ప్రిన్సిపాల్ ఉదంతం టాలీవుడ్ లో తీవ్ర సంచలనం రేపుతుండగా, ఈ కేసు మొత్తం బయటకు రావడానికి కారణం సినీ నటి అపూర్వ.   
Image result for actress apoorva
తన ఫోటోలు పెట్టి రూ.40 వేల రూపాయలు ఇస్తే..ఐటమ్ గర్ల్ వస్తుందని  గణేష్ పోస్ట్ చేయడం నటి అపూర్వకు ఈ విషయం తెలిసిందే. దాంతో ఆమె ఆవేదన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఈ కేసును ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గణేష్ పెట్టిన పోస్టింగ్స్ లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా ఉండటంతో, అవి ఎవరివన్న కోణంలోనూ పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇదిలా ఉండగా తనపై అపూర్వ కేసు పెట్టిందన్న విషయం తెలుసుకొని గణేష్, 'లొకాంటో' వెబ్ సైట్ లో పెట్టిన పోస్టింగ్స్, చిత్రాలన్నింటినీ డిలీట్ చేశాడని, ఇప్పుడు వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది.  ఈజి మనీ కోసం గణేష్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడని..కేవలం హీరోయిన్ల ఫొటోలు చూపించి, విటుల నుంచి ఆన్ లైన్ మాధ్యమంగా గణేష్ రూ. 2 లక్షల వరకూ వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.

గణేష్ బారిన పడిన వారి వివరాలు సేకరిస్తున్నామని, వారిని కూడా విచారిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. గణేష్ మొబైల్ ను సీజ్ చేశామని, అందులోని వివరాలు తమ విచారణకు కీలకమని వెల్లడించాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: