తెలుగు తెరపై మొదటి సారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘మహానటి’ సినిమా తీశారు. మొదట ఈ సినిమా అసలు నిర్మితం అవుతుందా అన్న అనుమానాలు ఎంతో మందికి వచ్చాయి.  అంతే ఇండస్ట్రీలో సైతం ఈ సినిమాపై రక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు.  వాటన్నింటికి చెక్ పెడుతూ..‘మహానటి’ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మాత్రమే కాదు చిత్ర పరిశ్రమ సైతం ‘మహానటి’ టీమ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. 
Related image
తెలుగు తారలపై వచ్చిన మొదటి బయోపిక్ అంత గొప్ప హిట్ అయినందుకు ఇప్పుడు మరిన్ని బయోపిక్ లు తీయడానికి దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతుంది.  తన తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.  ఇదిలా ఉంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు మహి వి.రాఘవ ‘యాత్ర’ తెరకెక్కిస్తున్నారు.  రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు గనుక, ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
Image result for ysr bio pic ysr wife
ఆయన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది.ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్ర కోసం 'ఆశ్రిత వేముగంటి'ని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం సుహాసినిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే సుహాసిని అంగీకరించిందని అంటున్నారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళిని తీసుకునన్నట్లు వార్తలు వచ్చాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: