భారతీయ చిత్ర సీమలో స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆ తర్వాత వీరిద్దరిక పెద్దగా ఏ చిత్రం కలిసి రాలేదు.  శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’ తీశారు..కానీ అనుకున్నంత ఫలితం రాలేదు.  దాంతో చాలా గ్యాప్ తర్వాత మరోసారి రజినీకాంత్ తో రోబో  2.0 చిత్రాన్ని రూపొందించారు.  ఈ చిత్రంలో రజనీకాంత్ .. అక్షయ్ కుమార్..ఎమీ జాక్సన్ ముఖ్య భూమిక వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది.

అయితే గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన ఆ విడుదల తేదీ వాయిదా పడింది. ఈ ఏడాది దీపావళికి ఆమీర్ ఖాన్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' .. క్రిస్మస్ కి షారుఖ్ 'జీరో' విడుదలకి వున్నాయి. అందువలన '2.ఓ' సినిమాను వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

అనుకున్నట్లుగానే రోబో 2.0 కి ముందు ‘కాలా’చిత్రం రిలీజ్ కావడం వంద కోట్ల క్లబ్ లో చేరడం తో రజినీ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నా 2.0 ఆలస్యం కావడం పల్ల నిరాశగా ఉన్నారు. ఇక '2.ఓ' సినిమా విడుదలయ్యేలోగా .. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ చేస్తోన్న సినిమా కూడా థియేటర్లకు వచ్చే అవకాశం లేకపోలేదు. శంకర్ అభిమానులు మాత్రం '2.ఓ' సంచలన విజయం సాధించడం ఖాయమనే నమ్మకంతో వున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: