మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నిర్వహించే ఒక బార్ అండ్ రెస్టా రెంట్ లో అఖిల్ హీరోయిన్ పనిచేయబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈన్యూస్ ఒక సినిమాకు సంబంధించింది. అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ సినిమాలో హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శిన్ నటించిన విషయం తెలిసిందే.
ఈసినిమా ఫ్లాప్ అయినా ఈమెకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమా చేస్తుండగానే ఈమెకు అనుకోకుండా మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టే అవకాశం దక్కింది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తీస్తున్న ‘చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్’ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వెంకటేష్ హీరోగా నటించిన ‘గురు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన రికితా సింగ్ తో పాటు కల్యాణి కూడ హీరోయిన్ గా నటించబోతోంది.
అయితే ఆశ్చర్యకరంగా ఈమె నటిస్తున్న ఈ రెండు సినిమాలు సెకండ్ హీరోయిన్ పాత్రలు కావడంతో కల్యాణి ఇలాంటి సెకండ్ హీరోయిన్ పాత్రలకు ఒప్పుకుని ఎందుకు తనకు తానుగా తన కెరియర్ అవకాశాలను పాడుచేసుకుంటోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం క్రేజ్ లేని మెగా మేనల్లుడు తేజ్ తో ఏమాత్రం క్రేజ్ లేని కల్యాణి కాంబినేషన్ ఎంత వరకు ఈ ‘చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్’ కు క్రేజ్ ను తీసుకువస్తుందో చూడాలి..