సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి అదృష్టం ఒక్కసినిమాతోనే కలిసి వస్తుంది..కొంత మందికి ఎన్ని సినిమాల్లో నటించినా గుర్తింపు రాదు. జబర్ధస్త్ కామెడీ షో తో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పలు ఛానల్స్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అనసూయ ఆ మద్య అక్కినేని నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నటించింది. ఆ సినిమా ఎంతో సక్సెస్ అయింది...కానీ అనసూయకు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో నటించినా అనసూయకు కలిసి రాలేదు.
ఈ మద్య సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ సినిమా తర్వాత అనసూయ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. ఈ సినిమాలో అనసూయ ‘రంగమ్మత్త’గా నటించింది. 'రంగస్థలం' సినిమాలో చెర్రీ, సమంత తర్వాత మెయిన్ కమర్షియల్ ఎలిమెంట్ అనసూయ రోల్ అనే చెప్పొచ్చు. రంగస్థలం తర్వాత అనసూయ ట్రెండ్ మార్చింది.
తాజాగా బీచ్ ఒడ్డున దిగిన ఓ పిక్ని సోషల్మీడియాలో అప్లోడ్ చేసింది అనసూయ. ఇసుకలో మోకాళ్లపై వుండి సముద్రపు అలలను చూస్తూ దిగిన ఫోటో అది. దీనికి స్మాల్ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది.
ప్రస్తుతం తనని మత్స్యకన్యతో పోల్చుకుంది. గతజన్మలో నేను మత్స్య కన్యగా ఉంటానని అనిపిస్తోందని, కానీ మత్స్యకన్యలకు మరణం అనేది ఉండదని అంటారు.. నేను అంతేనంటూ రాసుకొచ్చింది. రంగస్థలం తర్వాత సోషల్మీడియాలో స్పీడ్ పెంచిన ఈ బ్యూటీ, అప్పటినుంచి నిత్యం ఫ్యాన్స్తో టచ్లో వుంటూ రకరకాల ఫోటోలను షేర్ చేస్తోంది.