ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ ఈ సంవత్సరం సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.  దాదాపు సంవత్సర కాలం పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకుంటూ వచ్చారు.  అయితే ఆ అంచనాలకు మించి ‘రంగస్థలం’ సూపర్ హిట్ అయ్యింది.  1985 నాటి గ్రామీణ వాతావరణాన్ని..రాజకీయం,ప్రేమ, కుటుంబ అనుబంధాలు అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు సుకుమార్.  ఇక చిట్టిబాబు చెవిటివాడి పాత్రలో రాంచరణ్ నటనకు అభిమానులే కాదు..సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. 
Image result for rangasthalam
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనను పెళ్లి చేసుకొని జూన్ 14కి ఆరు సంవత్సరాలు పూర్తయింది.అయితే తమ పెళ్లిరోజు కానుకగా ఈ జంట కొందరిని సర్ప్రైజ్ చేసింది. తమ తోటలో పండిన మామిడి పండ్లను చరణ్-ఉపాసన దంపతులు తమ సన్నిహితులకు కొందరికి పంపించారు. నిర్మాత డీవీవీ దానయ్యకు మామిడి పండ్ల బుట్టను పంపించారు.
Image result for rangasthalam
'స్వీటెస్ట్ కపుల్ నుంచి స్వీట్ మామిడి పండ్లు వచ్చాయి' అంటూ దానయ్య ఫేస్ బుక్ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.నిర్మాత దానయ్యతో చరణ్ కి ఎంతో సాన్నిహిత్యం వుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'నాయక్' .. 'బ్రూస్ లీ' సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేస్తోన్న సినిమాను కూడా దానయ్యే నిర్మిస్తున్నాడు.
Related image
అందువలన ఆయనతో వున్న అనుబంధం కారణంగా చరణ్ మామిడి పండ్లను పంపించాడు. గతంలో పవన్ కల్యాణ్ ఇలా తన సన్నిహితులకు మామిడి పండ్లు పంపించేవాడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాంచరణ్...బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: