ఎలాంటి పండుగ లేకపోయినా వచ్చేనెల జూలై 6న కేవలం ఒక మెగా సెంటిమెంట్ ను నమ్ముకుని చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నట్లు వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో మధ్యంలో తాను ఉన్నాను అంటూ హీరో గోపీచంద్ తన ‘పంతం’ మూవీని ‘విజేత’ ‘తేజ్ ఐ లవ్యూ’ లతో పోటీగా విడుదల చేయడం ఇప్పుడు ఈ టాపిక్ హాట్ న్యూస్ గా మారింది. 
Actor Gopichand
గత కొంత కాలంగా వరస పరాజయాలతో పూర్తిగా క్రేజ్ కోల్పోయిన గోపీచంద్ కొత్త దర్శకుడు చక్రీతో చేస్తున్న ప్రయోగం ఈ ‘పంతం’. గోపీచంద్ కు ఇప్పటి వరకు కలిసి వచ్చిన మాస్ రివేంజ్ స్టోరీ ఈ ‘పంతం’ అని అంటున్నారు. ‘తేజ్ ఐ లవ్యూ’ పక్కా లవ్ స్టోరీ అయితే తండ్రి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ ‘విజేత’ కథ.
Latest news of gopichand Pantham!
ఇలా ఈమూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్స్ అని సరిపెట్టుకున్నా ఎటువంటి పండుగ హడావిడి వాతావరణం లేని జూలై మొదటి వారంలో ఈమూడు సినిమాలు ఒకేసారి విడుదల అయితే కనీసం ఈసినిమాలకు మంచి ఓపెనింగ్స్ అయినా వస్తాయా అన్న చర్చలు జరుగుతున్నాయి. దీనితో వాస్తవ పరిస్తుతులను గ్రహించి సాయి ధరమ్ తేజ్ గోపీచంద్ రాజీపడి చివరకు ఆఖరి నిముషంలో మెగా అల్లుడుకి లైన్ క్లియర్ చేస్తారు అని అంటున్నారు. 

Gopichand

ఆవిధంగా కుదరకపోతే గోపీచంద్ తన ‘పంతం’ నెగ్గించుకుని రేస్ లో నిలబడినా కలిసొచ్చే ప్రయోజనం ఏముంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తన అల్లుడు మేనల్లుడు మధ్య ఏర్పడిన ఈ అనవసర పోటీకి ఒక పరిష్కారం వెతికే పనిలో చిరంజీవి ఈసినిమాల నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: