ప్రేమమ్" వంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.   "సవ్యసాచి" చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం.
Image result for 'సవ్యసాచి'
ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక "బాహుబలి" తర్వాత కీరవాణి గారు "సవ్యసాచి"కి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది" అన్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త చక్కర్లు కొడుతుంది.    చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఒక వైపున డబ్బింగ్ పనులను .. మరో వైపున విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులను మొదలుపెట్టేశారు.
Image result for 'సవ్యసాచి'
గతంలో 'బాహుబలి' సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ను అందించిన 'మకుట' సంస్థవారే ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ను అందిస్తుండటం విశేషం. కథ .. కథనాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయని అంటున్నారు.  ఈ చిత్రంలో చైతూ హీరోయిజం..మాధవన్ విలనీజం హైలెట్ గా నిలవబోతుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: