టాలీవుడ్లోని సెక్స్ రాకెట్ కు సంబంధించి నిరంతరం సంచలన విషయాలు బయటకి వస్తూ ఉంటాయి. తాజాగా అమెరికాలో మన హీరోయిన్ల రంకు చేష్టలు బయటపడటం టాలీవుడ్ ను మరోసారి కుదిపేసింది. అవకాశాలు లేని వర్థమాన హీరోయిన్లకు ఈవెంట్ల పేరుతో అమెరికాకు పిలిపించుకొని వారికి డాలర్ల ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్న మోదుగుముడి దంపతులను ఇప్పటికే ఫెడరల్ ఏజెన్సీ వారు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


అయితే ఈ సెక్స్ రాకెట్ ముఠా కి సంబంధించి వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరియు యాంకర్ అనసూయలు కూడా స్పందించారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముఠా వారిని సంప్రదించారని తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికాలో షో చేసి చాలా  కాలం అయిందని తెలిపిన అనసూయ, చివరిసారిగా 2014 లో ఒక ఈవెంట్లో పాల్గొన్నానని తెలిపింది. కాగా రెండు సంవత్సరాల క్రితం అమెరికాలో నిర్వహిస్తున్న ఒక ఈవెంట్ లో పాల్గొనవలసిందిగా  శ్రీరాజ్‌ అనే వ్యక్తి తనను సంప్రదించాడని తెలిపిన ఆమె, ఆయన మాట తీరు నచ్చకపోవడంతో ఈవెంట్ చేయడానికి ఒప్పుకోలేదని తెలిపింది. అయినా ఆ ఈవెంట్ నిర్వాహకులు తాను వస్తున్నట్లుగా ప్రచారం నిర్వహించడంతో, ఆ వార్తలను అప్పటిలో ఆమె ఖండించినట్లు చెప్పుకొచ్చింది.


ఇక వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందిస్తూ... హీరోయిన్లతో సెక్స్ రాకెట్ నిర్వహించిన మోదుగుముడి దంపతులు తనను కూడా ఈ వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నించినట్లు చెప్పింది. ఈ మేరకు ఈవెంట్ పేరుతో తనను సంప్రదించారని చెప్పుకొచ్చింది. ఇలా  అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న హీరోయిన్లను ఈవెంట్స్‌ నిమిత్తం అమెరికాకు పిలిపించుకుని, డాలర్ల ఆశ చూపెట్టి తమకు తాము డబ్బుకు ఆకర్షితులయ్యేలా పురిగొల్పి వ్యభిచార కూపంలోకి దించుతారని ఆరోపించింది. హీరోయిన్ల పేరును బట్టి వారి రేట్ డిసైడ్ అవుతుందని తెలిపిన శ్రీరెడ్డి, అలా ఆ వ్యభిచార రొంపిలోకి దిగిన హీరోయిన్లకు సుమారు వెయ్యి డాలర్లు ముట్టజెబుతారని ఆరోపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: