తెలుగు ఇండస్ట్రీలోకి స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజివి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లారు.  తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.  అయితే విభజన తర్వాత ఏపిలో కాంగ్రెస్ కి పెద్ద ఆదరణ లభించకపోవడంతో ఆయన చూపు మళ్లీ చిత్రాలపై పడింది. ఈ నేపథ్యంలో వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారధ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’చిత్రంలో నటించారు.  ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతే కాదు చిరంజీవికి ఇది 150 వ చిత్రం కావడం మరో విశేషం. 
Image result for chiranjeevi\
తాజాగా ఆయన 151వ చిత్రంలో నటిస్తున్నారు.  తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షరవేంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ ప్రాజెక్టుకు మరో నిర్మాణ సంస్థ తోడయ్యిందట.
Image result for seaira narasimha reddy
రామ్‌చరణ్‌తో కలసి.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించబోతుందట. చిరంజీవి-కొరటాల కాంబినేషన్ మూవీని రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు.కొరటాల శివతో 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి చిత్రాలను నిర్మించిన మైత్రీ సంస్థ.. చరణ్‌తోనూ 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చింది.
Image result for seaira narasimha reddy
అందుకే.. చరణ్-కొరటాలతో మంచి అనుబంధం ఉన్న ఈ నిర్మాణ సంస్థ.. చిరంజీవి ప్రాజెక్ట్‌కు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనుందట.  తన మార్కు సామాజిక సందేశంతో కూడిన కథాంశంతోనే చిరంజీవి 152వ సినిమాను తెరకెక్కించనున్నాడట కొరటాల. మొత్తంమీద.. 'సైరా' షూట్ కంప్లీట్‌కాగానే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోన్న కొరటాల సినిమాతో.. మెగాస్టార్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: