టాలీవుడ్ లో క్రేజీ డైరక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరు. ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్ధలు కొట్టే సినిమాలను ఇచ్చిన ఆయన ఇప్పుడు హిట్లు కొట్టడంలో వెనుకపడిపోయారు. రీసెంట్ గా తనయుడు ఆకాష్ హీరోగా వచ్చిన మెహబూబా కూడా పూరికి ఫ్లాప్ ఇచ్చింది. ఆ సినిమాకు నిర్మాతగా కూడా పూరి జేబులు ఖాళీ చేసుకున్నాడు.


అయితే ఇన్ని దెబ్బలు తిన్నా సరే మళ్లీ కొద్దిపాటి గ్యాప్ తోనే మరో సినిమాకు సిద్ధమవుతాడు పూరి. ఇప్పుడు కూడా మెహబూబా టైంలోనే తనయుడు ఆకాష్ తో మరో సినిమా చేస్తానని చెప్పిన పూరి ఆ సినిమాకు సిద్ధమవుతున్నాడట. ఈసారి పక్కా మార్షల్ ఆర్ట్స్ తో ఆ సినిమా ఉంటుందట.


ఇక మరోపక్క పూరి తమ్ముడు సాయి రాం శంకర్ హీరోగా మరో సినిమా చేస్తాడట పూరి. ఫ్లాపులొచ్చినా సరే తన పంథాని మాత్రం మార్చట్లేదు పూరి జగన్నాథ్. మరి ఈ రెండు సినిమాలకు నిర్మాత కూడా తానే అవుతాడా లేక వేరే ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 


పూరి మార్క్ సినిమా వచ్చి చాలా రోజులైంది. మెహబూబా టీజర్, ట్రైలర్ చూసి తప్పకుండా పూరి కం బ్యాక్ మూవీ అవుతుందని ఆశించారు కాని దెబ్బేసింది. మరి తనయుడు ఆకాష్, తమ్ముడు సాయిరాం శంకర్ లతో పూరి చేస్తున్న ఈ ప్రయత్నం అయినా ఫలిస్తుందో లేదో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: