టాలీవుడ్ తారలను ఇండియా నుండి తాత్కాలిక వీసాపై అమెరికాకు రప్పించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు అన్న వార్తలకు ఇండస్ట్రీ మళ్ళీ కుదేలయింది. అసలే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని శ్రీరెడ్డి చేసిన పోరాటానికి చిత్ర పరిశ్రమ తలకిందులైతే, ఇప్పుడీ సెక్స్ రాకెట్ వార్తలకు ఇండస్ట్రీ నిర్ఘాంతపోయింది. ఇప్పటికే ఈ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న తెలుగు దంపతులని అక్కడి ఫెడరల్ ఏజెన్సీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.


అయితే దీనికి సంబంధించి ఒక ప్రముఖ తెలుగు హీరోయిన్ ను ఇటీవల అక్కడి చికాగో ఎయిర్ పోర్టులో సంబంధిత అధికారులు  విచారించిన సంగతి లేటుగా బయటకి వచ్చింది. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ల యొక్క చార్జిషీట్ ప్రకారం గత సంవత్సరం నవంబర్ నెలలో తాత్కాలిక వీసాతో ఆ నటి అమెరికాకి వెళ్లిందట. ఒక తెలుగు మహాసభలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నానంటూ ఆ తాత్కాలిక వీసాకు కారణం చెప్పిందట. అయితే ఆమె భాగోతం మాత్రం ఇప్పుడే బయటపడింది. 


నిజానికి ఆ వీసాలో సభ కాలిఫోర్నియాలో ఉంటే ఆమె మాత్రం చికాగో రావడం, అందులోనూ సభ జరిగి పూర్తయిన రెండు రోజులకు ఆమె అమెరికాలో అడుగుపెట్టడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను విచారించారంట. వీసాలో పొందుపరచిన వివరాలకు భిన్నంగా ఆమె ప్రవర్తించడంతో ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న అక్కడి అధికారులకు నమ్మలేని నిజాలు తెలిసాయి. వీసాలో పలానా సభకి వెళ్తున్నానని నమోదు చేయడంతో సంబంధిత అధికారులు ఆ సభ నిర్వాహకులను అడగగా వారు మాత్రం సభ ముందే జరిగిపోయింది ఆమె ఎవరో తెలియదని చెప్పేశారట. 


దీనితో ఆ హీరోయిన్ తాను వారం తరువాత జరుగబోయే ఇంకో సభలో కూడా పాల్గొనబోతున్నాను అని చెప్పినట్లు సమాచారం. మళ్ళీ అధికారులు అక్కడి తెలుగు సభలను నిర్వహించే పెద్దలను విచారించి అలాంటి కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలుసుకొని, నిర్ధారించి మరియు వీసాలో నమోదు చేసిన ఆ సభ ప్రాంత యజమానులను సైతం ప్రశ్నించగా వారు ఆమె చెప్పిన తారీఖులో ఎటువంటి కార్యక్రమం లేదని చెప్పుకొచ్చారు. దీనితో అధికారులు దాదాపు ఆరు గంటల సేపు ఆమెను విచారించారు.


ఈ క్రమంలోనే తెలుగు చిత్రాలకు సహ నిర్మాతగా పనిచేసిన మోదుగమూడి కిషన్ పేరు బయటకి వచ్చింది. ఈ విచారణలో కిషన్, తనకు ఇండియాలో రాజుగా పరిచయమయ్యాడని తెలిపింది. తన అమెరికా ప్రయాణానికి సంబంధించిన విమాన ప్రయాణ టిక్కెట్లు మరియు హోటల్ తదితర ఖర్చులను తానే చెల్లించి నిర్దారణ పేపర్లను మెయిల్ ద్వారా తనకు పంపించినట్లు విచారణలో వెల్లడించింది. దీనికి ప్రూఫుగా కిషన్ అలియాస్ రాజు ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీని పోలీసులకు అందించింది. విచారణ జరిపిన పోలీసులు కిషన్ చాలా మంది హీరోయిన్లను ఇలా వ్యభిచార కూపంలోకి ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. కాగా ప్రస్తుతం ఆ హీరోయిన్ వీసాను రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రేజీ హీరోయిన్ తన తొలి చిత్రంతోనే హిట్ ను సాధించింది. అంతేగాక ఒక పెద్ద ఫ్యామిలీలోని హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: