టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతుంది హాట్ బ్యూటీ మెహ్రీన్ కౌర్‌.   హీరో నానితో కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ‘డవ్’ బ్యూటీ మెహ్రీన్ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో మంచి విజయాలు అందుకుంది. హీరో గోపిచంద్‌తో నటించిన ‘పంతం’ ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. రెండు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో  తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో టాలీవుడ్ తారాల సెక్స్ రాకెట్ వ్యవహారం ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. 
Image result for mehreen kaur
ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న ‘పంతం’ సినిమా షూటింగ్ ముగియడంతో కెనాడాలోని వాంకోవర్‌కు బయల్దేరింది.  హీరో గోపిచంద్‌తో నటించిన ‘పంతం’ ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. హీరో విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం ‘నోటా’లోను ఆమె కథానాయికగా నటిస్తోంది. వెంకటేష్-వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’లో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది. ‘పంతం’ చిత్రంలో తన షెడ్యూల్ పూర్తికావడంతో ఆమె తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అమెరికా బయల్దేరింది. ఆమె టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ అని తెలియడంతో అమెరికాలోని హోమ్‌ల్యాండ్‌ ఇమిగ్రేషన్ అధికారులు.. 30 నిమిషాల పాటు ఆమెను ప్రశ్నించారు.
Image result for mehreen kaur
తన కుటుంబ సభ్యులను కలవడానికే అమెరికా వచ్చానని ఆమె అధికారులకు వివరించింది. దీనిపై ఓ వార్తా సంస్థతో మెహ్రిన్ మాట్లాడుతూ.. నేను తెలుగు హీరోయిన్ అని తెలియగానే అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారి ప్రశ్నలు విని నేను షాకయ్యాను. నేను ఎన్నోసార్లు అమెరికా వెళ్లా.. కానీ, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదు. వారు నన్ను ప్రశ్నించే సమయానికి ఆ అసాంఘిక పనుల సమాచారం కూడా తెలియదని తెలిపింది.
Image result for mehreen kaur
తెలుగు సినీ పరిశ్రమ నుంచి అమెరికాకు వచ్చే ప్రతి ఒక్కరినీ తాము ప్రశ్నిస్తామని చెప్పారు. నేను అమెరికా వెళ్లేది నా కుటుంబ సభ్యులను కలుసుకోడానికేనని వారికి తెలిపాను. దీంతో వారు నాకు క్షమాపణలు చెప్పి వదిలిపెట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై వారికి మంచి అభిప్రాయం లేదనిపించిందని మెహ్రీన్ పేర్కొంది. వారి ప్రశ్నలకు తానెంతో ఇబ్బందిపడ్డానని, ఒకరు చేసిన తప్పును మొత్తం ఇండస్ట్రీకే ఆపాదించడం బాధ కలిగించిందని మెహ్రీన్ ఆవేదన వ్యక్తం చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: