టాలీవుడ్ లో జర్నీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అంజలి తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సినిమల్లె చెట్టు ’సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. ఈ సినిమాలో అంజలి అచ్చతెలుగు అమ్మాయిగా అమాయకంగా నటించి మెప్పించింది. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాకపోయినా..అంజలికి మాత్రం క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ బాగా బిజీ అయ్యింది.
ఆ మద్య తెలుగులో డుదలైన గీతాంజలి చక్కటి విజయం సాధించింది. రాజ్ కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం హరర్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రానికి తాజాగా స్వీకెల్ రాబోతుంది. తొలి భాగాన్ని నిర్మించిన కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమాస్ ఈ సీక్వెల్ను కూడా తెరకెక్కించనున్నాయి. అయితే ఈ మద్య మంచి హిట్ సాధించిన సినిమాలు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజలి నటించిన ‘గీతాంజలి’సినిమా సీక్వెల్ రాబోతుంది.
కోన వెంకట్ కథ అందించనుండగా, అంజలి హీరోయిన్గా నటించనుంది. సీక్వెల్లో దర్శకుడు మాత్రం మారనున్నారు. రాజ్ కిరణ్ స్థానంలో భారతీయ మూలాలున్న అమెరికా పౌరుడు వేదుల సుబ్రహ్మణం గీతాంజలి-2ను డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం ప్రభుదేవా చేతుల మీదుగా తొలి పోస్టర్ను విడుదల చేశారు. అయితే సీక్వెల్ గా వచ్చిన సినిమాలు కొన్ని మాత్రమే హిట్ అవుతున్నాయి..మరి గీతంజలి 2 ఏ రేంజ్ లో మెప్పించగలదో వేచి చూడాలి.