సినిమా రంగం తప్ప ఏ రంగంలోనూ మహిళలపై భారీ ఎత్తున వేధింపులు ఉండవని ప్రపంచం మరచిపోకుండా ఎప్పటికప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచానికి గుర్తుచేస్తూ ఉంటుంది. ఎందుకంటే తాజాగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనాలు. శ్రీరెడ్డి కి జరిగిన ఉదంతమే ప్రకంపనలు సృష్టిస్తే, తాజాగా అమెరికాలో తెలుగు హీరోయిన్లతో వ్యభిచారం నిర్వహించిన తెలుగు దంపతుల యవ్వారాలు ఇండస్ట్రీ పరువును బజారుకీడ్చాయి.


ఇండస్ట్రీలో నటీమణులకే కాదు పాటల రచయిత్రిలకు సైతం వేధింపులు తప్పవన్న సంగతి బయటకు వచ్చింది. ఒక రొ మాంటిక్ క్రైమ్ కథ  సినిమాతోఇండస్ట్రీ కి పాటల రచయిత్రిగా పరిచయమయి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలకు మంచి పాటలు అందించిన గేయ రచయిత్రి శ్రేష్ట ఇండస్ట్రీలో   తనకు కూడా ఎదురయిన చేదు అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.


ఆమె మాట్లాడుతూ..స్వయానా ఒక మహిళా డైరెక్టర్ తనకు ఫోన్ చేసి ఒక వ్యక్తి తనకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడని గోవాకు రమ్మని చెప్పిందని  తెలిపింది. కానీ తాను నిరాకరించడంతో ఆ వ్యక్తి తనను చెప్పలేని పదజాలంతో దూషించాడని చెప్పింది. అంతేగాక ఒక నిర్మాత  ప్రపోజల్‌ను తోసి పుచ్చడంతో స్వయానా ఆ నిర్మాత భార్యే తన భర్తతో పడుకోవచ్చు కదా అని బలవంతం చేసిందని చెప్పుకొచ్చింది. అందువల్లే ఇండస్ట్రీకి రెండు సంవత్సరాలు దూరమయినట్లు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: