మొన్న జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో చిరంజీవి బాలకృష్ణ జూనియర్ ప్రభాస్ లను కాదని క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు నందీ అవార్డ్ రావడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సంఘటనను పక్కకు పెట్టి విజయ్ దేవరకొండ తనకు వచ్చిన ఫిలిం ఫేర్ అవార్డ్ ‘బ్లాక్ లేడీ’ ని వేలం పాటలో పెట్టడం మరింత సంచలనంగా మారింది.
తెలుగు ప్రజలు ఇరు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఒక తెలంగాణ నేపద్యం ఉన్న హీరోకు ఫిలిం ఫేర్ అవార్డ్ రావడం ఇదే మొదటిసారి. దీనితో విజయ్ దేవరకొండ తనకు ఉన్న తెలంగాణ అభిమానాన్ని ఈ అవార్డ్ విషయంలో కూడ చూపించాడు. తనకు వచ్చిన తన మొట్టమొదటి ఫిలిం ఫేర్ అవార్డ్ ను వేలం పాటలో పెట్టి ఆవచ్చిన మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని సంకల్పించుకుని తన అభిప్రాయాన్ని మంత్రి కేటీఆర్ కు తన ట్విటర్ ద్వారా తెలియచేసాడు.
విజయ్ కు లభించిన అవార్డ్ కు శుభాకాంక్షలు తెలియచేసిన మంత్రి కేటీఆర్ విజయ్ చేసిన సూచన బాగుంది అంటూ ప్రశంసలు కూడ కురిపించాడు. లేటెస్ట్ గా ఈమధ్యనే విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోని పిల్లల కోసం చెన్నై నుండి ప్రత్యేకంగా ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ వ్యాన్ తెప్పించిన విషయం తెలిసిందే. దీనితో ఈ యంగ్ హీరో మంచి మనసును చాలామంది మెచ్చుకున్నారు.
ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా విజయ్ తన మొట్టమొదటి ఫిలిం ఫేర్ అవార్డ్ ను వేలం పాటలో పెట్టి తన మంచి మనసు చాటుకున్నాడు. కోట్ల రూపాయలలో భారీ పారితోషికాలు తీసుకుంటున్న మన టాప్ హీరోలు అంతా విజయ్ దేవర కొండలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని ఈయంగ్ హీరో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..