తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ ల పర్వం కొనసాగుతుంది.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ఘన విజయం సాధించింది.  అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘మహానటి’తెరకెక్కించారు.  సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటనకు ప్రేక్షకులే కాదు..రాజకీయ నాయకులు సైతం ఫిదా అయ్యారు.  ఇప్పుడు ఇంటస్ట్రీలో మరికొన్ని బయోపిక్ లు తెరకెక్కబోతున్నారు. 

ముఖ్యంగా మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కించబోతున్నారు.  ఈ చిత్రానికి గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన క్రిష్ దర్శకత్వం వహించబోతున్నారు.  ప్రస్తుతం బాలకృష్ణ మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించబోతున్నారు.  ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

వచ్చే ఏడాది జనవరి 9న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపింది. 1983లో అదే రోజున ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో, అదే రోజున సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అంతే కాదు బాలకృష్ణ సెంటిమెంట్ అయిన సంక్రాంతి బరిలో ఉండబోతున్నారు..ఈ చిత్రంతో మరో హిట్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా... క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: