యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇద్దరు వారసులతో ఇన్ స్టాగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ట్విట్టర్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ఈమధ్యనే ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ ఓపెన్ చేశాడు. మొదటి పిక్ గా తన ఇద్దరి వారసులతో వచ్చాడు. పెద్ద కొడుకు అభయ్ రామ్ తన బుల్లి తమ్ముడిని ఎత్తుకుని ఉండగా వారిద్దరిని ఫోటో తీస్తూ ఎన్.టి.ఆర్ కనిపించాడు.  


ఈ పిక్ ఎంత్ చూడముచ్చటగా ఉంది అంటే మాటల్లో చెప్పలేం. జై లవ కుశ ఒకే ఫ్రేమ్ అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బుల్లి వారసుడిని లిటిల్ టైగర్ అనడం మొదలు పెట్టారు. తారక్ ఇన్ స్టాగ్రాంలో ఈ పిక్ పెట్టి ఫ్యాన్స్ కే కాదు సిని ప్రియులను సర్ ప్రైజ్ ఇచ్చాడు.  


ప్రస్తుతం ఎన్.టి.ఆర్, త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి తో మల్టీస్టారర్ మూవీ చేయాల్సి ఉంది. అరవింద సమేతలో ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తాడట తారక్. అందుకే సినిమా ఫస్ట్ లుక్ తోనే సిక్స్ ప్యాక్ తో కనిపించాడు.  


మొత్తానికి నందమూరి ఫ్యాన్స్ అందరిని ఉత్సాహపరచేలా ఎన్.టి.ఆర్ తన వారసుల పిక్ తో సందడి చేస్తున్నాడు. ఈమధ్య వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న తారక్ రాబోతున్న అరవింద సమేత సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: