తెలుగు బుల్లితెరపై ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 నడుస్తుంది.  ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ సీజన్ లో 13 మంది సెలబ్రెటీలు కాగా, 3 కామన్ పీపుల్స్ గా ఎంట్రీ ఇచ్చారు.  అందులో మెడల్ సంజన, గణేష్, నూతన్ నాయుడు.  వారం రోజులు పాటు సాగిన బిగ్ బాస్ 2 లో ఆదివారం సంజన ఎలిమినేట్ అయ్యింది.  అయితే సంజన బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హడావుడి చేస్తూనే ఉంది. బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టడంతోనే జైలు జీవితం గడిపిన ఈ భామ అప్పుడే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆ తరవాత ప్రతిరోజూ విసుర్లు, అరవడం మామూలైపోయింది. ముఖ్యంగా తేజస్వి, బాబు గోగినేనిపై తన అసహనాన్ని చూపించింది. దీంతో చాలా మంది హౌజ్‌మేట్స్‌ ఆమెను ఎలిమినేట్ చేయాలని బిగ్‌ బాస్‌కు నామినేట్ చేశారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాని తొలి ఎలిమినేటర్‌గా సంజనను ప్రకటించారు. అయితే, సీజన్-1ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తో పోలుస్తూ... కొందరు నానిపై విమర్శలు చేస్తున్నారు. మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్ లో నిష్క్రమించిన సంజన కూడా ఓ ఛానల్ తో మాట్లాడుతూ, నానిని విమర్శించింది.
రెమ్యునరేషన్ లేదు
నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న తీరు నాకు అస్సలు నచ్చలేదు దానికి కారణం ఎన్టీఆర్ కావచ్చు అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు బిగ్ బాస్ నిర్వాహకులు తనతో పాటు సామాన్యులుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన నూతన నాయుడు, గణేష్ కు రెమ్యునరేషన్ ఇవ్వలేదని సంజన వ్యాఖ్యానించింది.

బిగ్ బాస్ తమకు ఓ ఫ్లాట్ ఫామ్ అని నిర్వాహకులు భావించడమే అందుకు కారణం అని సంజన తెలిపింది.  ఇక 'ఎన్టీఆర్ ఐఫోన్ లాంటి వాడు. నాని చైనా ఫోన్. ఒక్కసారి ఐఫోన్ వాడినవారికి వేరే ఫోన్లు నచ్చవు' అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై నాని ఎంతో హుందాగా స్పందించాడు. 'నాక్కూడా ఐఫోన్ అంటేనే ఇష్టం' అంటూ ట్వీట్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: