తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మద్య వరుస పెట్టి బయోపిక్ సినిమాలు తెరపైకి వస్తున్నాయి.  ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’  సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భత నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులే కాదే పొలిటీషయిన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ రాబోతుంది.  గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మిక సినిమా అందించి దర్శకులు క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నారు.  ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. 
Image result for ys yatra movie
త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.  ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారి రాజకీయ నేపథ్యంలో ఓ బయోపిక్ రాబోతుంది.  ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా రాబోతుంది.  దర్శకుడిగా 'ఆనందో బ్రహ్మ' సినిమా సక్సెస్ తో తన సత్తా చాటుకున్న మహి వి.రాఘవ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను రూపొందించనున్నాడు.
Related image
రాజశేఖర్ రెడ్డి పాత్రకి గాను ఇప్పటికే మమ్ముట్టిని ఎంపిక చేసి .. 'యాత్ర' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసి ఫస్టు పోస్టర్ ను కూడా వదిలారు. ఈ నెల 20వ తేదీనుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. రేపటి నుంచి సెప్టెంబర్ వరకూ ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగు పార్టును ముగించనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్రలో 'బాహుబలి' ఫేమ్ ఆశ్రిత వేముగంటి .. సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవమెంతన్నది చూడాలి మరి.      



మరింత సమాచారం తెలుసుకోండి: