మహేష్ సినిమా గురించి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత పీవీపీ స్క్రిప్ట్ గురించి కోర్ట్ లో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి కోర్ట్ కూడా అందరికీ నోటీసులు పంపించింది. అయితే మహేష్ ఇంట్లో జరిగిన చర్చలు సఫలం అయినట్లు తెలుస్తుంది.  సినిమా ఇక సజావుగా ముందుకు వెళ్తుంది. ఈ మేరకు నిర్మాతలు పివిపి, దిల్ రాజు, అశ్వనీదత్, మహేష్ భార్య నమ్రతల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మరో రౌండ్ చర్చలు ఈ రోజు పివిపి, దిల్ రాజు, అశ్వనీదత్ ల నడుమ జరుగుతాయి.

Image result for mahesh babu

మహేష్ బాబు ఇంట్లో నిన్నరాత్రి జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు సమాచారం. ఈ చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు. మహేష్-వంశీ పైడిపల్లి సినిమాకు ఇకపై ముగ్గురు నిర్మాతలు వుంటారు. పివిపి, దిల్ రాజు, అశ్వనీదత్ ముగ్గురు నిర్మాతలుగా వుంటారు. ముగ్గురు సమానంగా పెట్టుబడి పెడతారు. ముగ్గురు సమానంగా లాభాలు పంచుకుంటారు. సాధారణంగా సినిమాకు రెమ్యూనిరేషన్ ప్లస్ లాభాల్లో సగం వాటా తీసుకునే హీరో మహేష్ బాబు ఈ సినిమా కు లాభాల్లో వాటా తీసుకోరు.

Image result for mahesh babu

రెమ్యూనిరేషన్ కూడా రీజనబుల్ గా తీసుకుంటారు. దీనికి రెండు కారణాలు.  నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ ఎప్పుడో ఏళ్ల క్రితం అడ్వాన్స్ ఇచ్చినందున, ఆ మొత్తానికి వడ్డీలు, అప్పట్లో మహేష్ రెమ్యూనిరేషన్ వంటివి దృష్టిలో వుంచుకోవడం అన్నది ఓ కారణం. అలాగే ముగ్గురు నిర్మాతలకు కలిపి ఒకటే సినిమా చేయాల్సి రావడం అన్నది మరో కారణం. ఇకపోతే, ఈ సినిమాకి ఒకె అనడం ద్వారా, ఇక పివిపికి మహేష్ బాబు రెండో సినిమా చేయాల్సిన అగ్రిమెంట్ ముగుస్తుంది. అదే విధంగా ఈ సినిమాపై వున్న అన్ని వివాదాలను పివిపి ఉపసంహరించుకుంటారు. అయితే ఈ వివాదం వల్ల పివిపి కి దాదాపు అరకోటి వరకు లీగల్ ఖర్చులు అయినట్లు బోగట్టా. అదేం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: