2006 లో తెలుగులో వచ్చిన మాయాజాలం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి పూనమ్ కౌర్. తెలుగులో హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్నా సరైన హిట్ లేకపోవడంతో ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అవుతున్నా సరైన ఫేమ్ సంపాదించలేకపోయింది. మధ్యలో సపోర్టింగ్ పాత్రలు చేసినా దానివల్ల పేరొచ్చింది అంతంత మాత్రమే.


అయితే ఈ మధ్య సినిమాల కంటే వివాదాల్లో ఎక్కువగా నిలిచి ట్రెండింగ్ అయింది. కత్తి  మహేష్ మరియు పవన్ కళ్యాణ్ మద్య వివాదం జరుగుతున్నప్పుడు మధ్యలో దూరి కత్తి దెబ్బకి నలిగిపోయింది. మొన్న కూడా ఒక ప్రముఖ డైరెక్టరును పరోక్షంగా విమర్శించి వార్తల్లో నిలిచింది. జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త! నమ్మకద్రోహి అంటూ ట్వీటు చేసి వివాదానికి తెరలేపింది.


అయితే తాజాగా ఆమె మళ్ళీ పరోక్షంగా   ట్వీట్లు చేసింది. విరిగిన కొన్ని రెక్కలు నయం అవడంతో ఒక పక్షి మళ్ళీ తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఏ దుష్టుల ఆలోచనలు కూడా దానిపై పడద్దు. ఒక మహిళగా ఆనందంగా ఉన్నాను అంటూ ట్వీటు చేసింది. అయితే ఈ ట్వీటు వెనుక రేణుదేశాయ్ మొన్నీ మధ్య సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు కారణం అని స్పష్టంగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: