తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 వస్తుంది. ఈ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే..అయితే కంటెస్టంట్లు కూడా సెలబ్రెటీలు..మంచి పరిచయం ఉన్న వారు కావడం..మొదట రెండు వారాల వరకు స్నేహపూర్వకంగా ఉండటం జరిగింది. కానీ బిగ్ బాస్ సీజన్ 2 లో మాత్రం మొదటి రోజు నుంచి గొడవలు జరగడం ప్రారంభం అయ్యాయి. అంతే కాదు ఈసారి కామన్ పీపుల్ ముగ్గురు ఎంట్రీ కావడం అందులో ఒకరైన సంజన ఆదివారం ఎలిమినేట్ కావడం జరిగింది.
ఇక సంజన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో సభ్యులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని..సెలబ్రెటీలం అన్న బింకానికి పోతున్నారని అసలు బిగ్ బాస్ ఈసారి ఏమీ బాగలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2లో 10 ఎపిసోడ్లు పూర్తయ్యే సరికి నాటకీయతకు కావాల్సిన ఎలిమెంట్స్ ఒక్కొక్కటీ యాడ్ అవుతూ వస్తున్నాయి. బుధవారం నాటి ఎపిసోడ్లో (జూన్ 20) లగ్జరీ బడ్జెట్ కోసం ‘ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది’ టాస్క్ రెండు టీంల మధ్య హోరా హోరీగా ప్రారంభమైంది.
ఈ టాస్క్లో తొలిత తనీష్, సామ్రాట్ల మధ్య హోరా హోరీ పోరు జరిగింది. మట్టిలో పోటీపడి జెండాలను పోగుచేశారు. ఈ టాస్క్ గీతా మాధురి ఆధ్వర్యంలో జరగగా.. సామ్రాట్ విజేతగా నిలిచారు. ఈ టాస్క్ లో తనిష్ కాలికి తీవ్ర గాయం కావడంతో..తనదైన శైలిలో ఫైర్ అయ్యారు బాబు గోగినేని. ఇలాంటి టాస్క్లను ప్రోత్సహించవద్దు అంటూ హౌస్ మేట్స్కి చురకలు అంటిస్తూ.. ఇవేం టాస్క్లు. శరీరానికి గాయాలు అయ్యేటట్లుగా పిచ్చి పిచ్చి టాస్క్లుగా పెట్టడం మనుషులను ఇబ్బందులకు గురిచేయడం అనేది అమానుషమైన చర్య అని అన్నారు. గాయాలై రక్తం వస్తుంటే మీకు తమాషాగా ఉందా? లేకపోతే రెండు కత్తులు ఇవ్వండి కొట్టుకుంటారు..రారా బిగ్ బాస్ కిందకి నువ్. నీ సంగతి చూస్తా అంటూ బిగ్ బాస్కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాబు గోగినేని.