బాలీవుడ్లో మరో జంట పెళ్లి బంధంతో ఒకటి కానుంది. గత కొన్నాళ్లుగా దీపిక పడుకునే, రణ్వీర్ సింగ్ల మధ్య ప్రేమాయణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి నవంబర్ 10వ తేదీన జరగునుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మద్య స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అందాల భామ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. రీసెంట్ గా అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ కూడా పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్ లు కూడా పెళ్లికి రెడీ అవుతున్నారు.
ఇరువురి కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మల తరహాలో డెస్టినేషన్ వివాహనికి ప్లాన్ చేస్తున్నారా? లేక బెంగళూరు వివాహ వేడుకకు వేదిక కానుందా? అనే అంశంపై స్పష్టత రాలేదు. నవంబర్ 10న వెడ్డింగ్కు ఈ నటులిద్దరితో పాటు ఇరు కుటుంబాలూ గ్రీన్సిగ్నల్ ఇచ్చాయని సమాచారం.
మరోవైపు ఉదయ్పూర్ ప్యాలెస్లో అంగరంగవైభవంగా వివాహ వేడుక నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని అయితే దీనిపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని దీపికా పదుకోన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. తను కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను త్వరగా పూర్తి చేసి పెళ్లి చేసుకోవాలని రణ్వీర్ సింగ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.