‘అజ్ఞాతవాసి’ ఫెయిల్ అవ్వడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ తీస్తున్న ‘అరవింద సమేత’ మూవీ నిర్మాణ విషయంలో తరుచూ జూనియర్ త్రివిక్రమ్ నిర్ణయాలకు అడ్డు చెపుతున్న విషయాలకు సంబంధించిన వార్తలు ఇప్పటికే అనేకం వచ్చాయి. ఈవార్తలను త్రివిక్రమ్ ఖండించినా ఈమూవీ విషయమై మరో హాట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హల్ చల్ చేస్తోంది. 
Jr NTR's 28th film titled as Aravindha Sametha
ఈమూవీని ఎట్టి పరిస్తుతులలోను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలన్న పట్టుదలతో త్రివిక్రమ్ ఈమూవీ పాటల ట్యూన్స్ విషయమై చాల పట్టుపట్టి సంగీత దర్శకుడు తమన్ చేత మంచి ట్యూన్స్ వచ్చేలా చాలశ్రద్ధ పడుతున్నాడు. అయితే త్రివిక్రమ్ కు జానపద పాటలు అంటే ఉన్న మోజు రీత్యా ఈమూవీలో కూడ ఒక ఫోక్ సాంగ్ ను పెట్టాలని ఆ పాటను రాయించి దానికి తమన్ చేత ట్యూన్ కట్టించినట్లు సమాచారం. 
Aravinda sametha class
తెలుస్తున్న సమాచారం మేరకు ‘కృష్ణార్జున యుద్ధం’ లో ‘దారి చూపు’ పాటను పాడిన పెంచల్ దాస్ చేత ఈపాటను చిత్తూరు యాసలో పాడించాలని ఈపాటకు సంబంధించిన రికార్డింగ్ రిహార్సల్స్ కూడ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ తన పై  జానపద పాట ప్రయోగం వద్దని ఒక పక్కా మాస్ సాంగ్ ను పెట్టమని సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈసినిమా టైటిల్ విషయమై కూడ తన మాట పూర్తిగా నెగ్గలేదు అని త్రివిక్రమ్ బాధపడుతున్న నేపధ్యంలో తనకు ఎంతో ఇష్టమైన ఫోక్ సాంగ్ విషయంలో కూడ తన మాట చెల్లుబాటు కాకపోవడంతో కొంత నిరాశకు గురి అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ తీసే సినిమాల విషయంలో త్రివిక్రమ్ నిర్ణయాలకు అడ్డు చెప్పిన సందర్భాలు చాల తక్కువ అయితే ఒకే ఒక్క ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ త్రివిక్రమ్ మాట విలువను కూడ తగ్గించిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: