ఒక వైపున నిర్మాతగాను .. మరో వైపున హీరోగాను వరుస సినిమాలతో ధనుష్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'మారి 2' సినిమా చేస్తున్నారు. సాయిపల్లవి .. వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగు దశలో వుంది. రీసెంట్ గా ధనుష్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. తాజాగా హీరో ధనుష్కు గాయాలయ్యాయి. మారి-2 చిత్ర షూటింగ్లో భాగంగా శుక్రవారం క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో గాయపడినట్లు సమాచారం.
ధనుష్ కుడి కాలికి, ఎడమ చేతికి గాయాలైనట్లు, చిత్రంలో విలన్ పాత్రధారి టోవినో థామస్ కూడా స్వల్ఫంగా గాయపడినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పేకప్ చెప్పేద్దామని దర్శకుడు బాలాజీ మోహన్ అన్నప్పటికీ, ఆ తరువాత ఆ సీన్ చేయాలంటే మిగతా ఆర్టిస్టుల డేట్స్ దొరకడం ఇబ్బంది అవుతుందంటూ ధనుష్ షూటింగులో పాల్గొన్నారట. ఇక తనకు పెద్ద గాయాలు ఏమీ కాలేదని షూటింగ్ అన్న తర్వాత ఇలాంటివి సర్వ సాధారణం అని కంగారుపడాల్సిన అవసరం లేదని ధనుష్ కాసేపటి క్రితం ఫ్యాన్స్ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు.
సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తుండగా, దీపావళికి మారి-2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ధనుష్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.