తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘అజ్ఞాతవాసి’చిత్రం తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు.  సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించిన ఆయన కొంత కాలంగా ప్రజల తరుపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసేందుకు ఆయన సిద్దంగా ఉన్నారు.  అందుకోస తెలుగు రాష్ట్రాల్లో జనసేన ప్రతిష్టంగా ఉంచేందుకు పర్యటనలు చేస్తున్నారు.  ఇప్పటికే ఉత్తరాంధ్రలో పర్యటన చేసిన ఆయన త్వరలో విజయవాడలో పర్యటించనున్నారు. 
Image result for pawan kalyan son akhira rent house
అయితే రాజధానిలో ఆయన స్వంతంగా స్థలం తీసుకొని ఇల్లు, కార్యాలయం కట్టిస్తున్నారు..అయితే దాని నిర్మాణం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విజయవాడలో పడమట లో ఓ అద్ద భవనం తీసుకున్నారు.  ఈ కార్యక్రమంలో పవన్ భార్య అన్నా లెజినోవా, పవన్, రేణూ దేశాయ్ ల తనయుడు అకీరా తదితరులు పాల్గొన్నారు.
Related image
తన పెద్ద కుమారుడిని వెంట బెట్టుకుని పవన్ గృహ ప్రవేశం చేయడం అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.  అభిమానులు కొంతమంది అకీరా నందన్ హైదరాబాద్ షిఫ్ట్ అయి పవన్ వద్దనే ఉంటున్నాడని అనుకున్నారు. ఈ విషయం రేణు దేశాయ్ వరకు వెళ్లడంతో ఆమె క్లారిటీ ఇస్తూ స్కూలుకు కొన్ని రోజులు సెలవులు ఉండటంతో అకీరా తన తండ్రి పవన్ వద్దకు వెళ్లాడని, అంతేగాని హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: