బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజిత్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యతతో ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో 11 పాత్రలు చాలా ముఖ్యమైనవని.. వారి మధ్యే సినిమా నడుస్తుందని అన్నాడు ప్రభాస్.  


150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమా చూసిన అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సాహో తెరకెక్కిస్తున్నారు.


బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ ఆ వెంటనే వస్తున్న సినిమా కాబట్టి సాహో సినిమాను తెలుగుతో పాటుగా తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ప్రభాస్ రేంజ్ మరింత పెంచేలా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. 


ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ రాధాకృష్ణ డైరక్షన్ లో లవ్ స్టోరీ చేస్తాడని అంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం తన తర్వాత సినిమా గురించి ఎలాంటి ఇన్ ఫర్మేషన్ ఇవ్వలేదు. సాహో తర్వాత కూడా యువి క్రియేషన్స్ లోనే సినిమా చేస్తాడట ప్రభాస్. సాహో మాత్రం ఎలా లేదన్నా వరల్డ్ వైడ్ 300 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: