గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్,శోభన్ బాబు, కృష్ణ కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువ అయ్యాయి. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ చాలా అద్భుతంగా కుదిరింది. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాతా మరోసారి వెంకటేష్, పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో గోపాల గోపాల చిత్రం కూడా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం తెలుగులో పలు మల్టీస్టారర్ చిత్రంలు తెరకెక్కబోతున్నాయి.
తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో పవన్ సాతినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఆగష్టులో మొదలుకానుంది. ఈ చిత్రం మల్టీ స్టారర్ గా ఉండనుంది. కళ్యాణ్ రామ్ తో పాటు అక్కినేని నాగార్జున కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. కాకపోతే ఈ మద్య తెలుగు లో మల్టీస్టారర్ సినిమాలు విపరీతంగా వస్తున్నాయి ఈ నేపథ్యంలో వీరిద్ది కాంబినేషన్ లో చిత్రం రావడం ఖాయమంటున్నారు సినీ ప్రేమికులు.
ప్రస్తుతం నాగార్జున తనయులు హీరోగా రాణిస్తున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతే కాదు పలు చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. అంతే కాాదు నాగార్జున, నాని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించాడు సిద్ధమేనని ఎప్పుడో చెప్పిన నాగార్జున ప్రస్తుతం నానితో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హై బడ్జెట్ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించనున్నారు.