అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నాగార్జున తర్వాత  విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'ఇదం జగత్'. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నా, ఆయనకి సక్సెస్ అనేది దూరంగానే ఉండిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరో వైవిధ్యభరితమైన కంటెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. ఆ సినిమా పేరే ..  'ఇదం జగత్'. పద్మావతి .. శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిల్ శ్రీకంఠం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రాత్రివేళలో సిటీలోని ఓ రోడ్డుపై కెమెరా పట్టుకుని సుమంత్ కనిపిస్తున్నాడు. ఓ మరణానికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఆయన ఉన్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

అలా ఈ పోస్టర్ అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంతో పాటు సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న‘‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలోనూ నటిస్తున్నారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్.

మరింత సమాచారం తెలుసుకోండి: