తెలుగు ఇండస్ట్రీలో రమా ప్రభ గురించి తెలియని వారు ఉండరు. పాత తరం కామెడీ నటుల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. పద్మనాభం, రేలంగి ఉన్నారంటే..ఖచ్చితంగా రమాప్రభ ఉండాల్సిందే. వీరి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అప్పట్లో పోస్టర్ పై ఈ జంట కనిపిస్తే చాలు .. జనం థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు. అలాంటి రాజబాబుతో కలిసి తాను చేసిన పాత్రలను గురించి రమాప్రభ ఇప్పటికీ తలచుకుంటున్నారు. రమాప్రభ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..రాజబాబును నేను తమ్ముడిగా భావించేదానిని. రేయ్ .. అని ఆప్యాయంగా పిలిచేదాన్ని అన్నారు.
అప్పట్లో షూటింగ్ సెట్స్ లో అందరం ఆప్యాయతలు అనురాగాలు పంచుకునేవాళ్లం. ఎవరికి వారు అన్న విధంగా కాకుండా ఒక్క కుటుంబంలో ఉన్నవాళ్లలా ఉండేవాళ్లమని..ఈ కాలంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పరిస్థితి అప్పట్లో లేదని అన్నారు. రాజబాబు నా పట్ల ఎంతో ప్రేమానురాగాలను చూపించేవాడు. తెరపైన .. బయట కూడా ఎంతో సందడి చేస్తూ కనిపించే రాజబాబు చనిపోవడం నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపిన సంఘటన.
రాజబాబు చనిపోయి వార్త విని ఆ రోజు నేను మనిషినే కలేదు..చాలా వరకు ఇదంతా అబద్దం అనుకున్నాను. రాజబాబు మరణం నన్ను బాగా కుంగదీసింది. నా పట్ల అంతటి ఆత్మీయానురాగాలను చూపించినది ఎస్వీ రంగారావుగారే. నన్ను ఓ కూతురులా ఆయన చూసుకునేవారు. నేను ఆయనను 'డాడీ' అని పిలిచేదానిని" అంటూ చెప్పుకొచ్చారు.