అక్కినేని వారసుడు అఖిల్ వినాయక్ డైరక్షన్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ అవగా రెండేళ్ల గ్యాప్ తీసుకుని విక్రం కుమార్ తో హలో సినిమా చేశాడు. ఆ సినిమ కూడా నిరాశపరచడంతో యంగ్ డైరక్టర్ వెంకీ అట్లూరితో తన మూడవ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. 


ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ మీద ఉంది. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఏమాత్రం లేటు చేయకుండా తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడట అఖిల్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ డైరక్టర్ డైరక్షన్ లో అఖిల్ మూవీ ఉంటుందట.


సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించిన గోపి మోహన్ అఖిల్ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడట. కోనా వెంకట్ గోపి మోహన్ ల పెన్ పవర్ గురించి అందరికి తెలిసిందే. అయితే కోనా వెంకట్ ప్రొడక్షన్ లోకి  వెళ్ళగా.. గోపి మోహన్ దర్శకత్వంపై గురి పెట్టాడు. అఖిల్ హీరోగా తన మొదటి సినిమా ప్లాన్ చేస్తున్నాడట గోపిమోహన్. 


తనయుడి కెరియర్ మీద దిగులు పెంచుకున్న నాగార్జున గోపిమోహన్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడట. కచ్చితంగా అఖిల్ కెరియర్ కు ఈ సినిమా మంచి బూస్టప్ ఇస్తుందని భావిస్తున్నారట. త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు వస్తుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: