సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్ హోదా రావడానికి హీరో, హీరోయిన్లు ఎన్నో సినిమాలు తీయాల్సి ఉంటుంది. అలా తీసినా కూడా సక్సెస్ అవుతారో లేదో తెలియని పరిస్థితి. తమ సమకాలీన హీరో, హీరోయిన్లతో పోటీ పడుతూ అందరిచే షెభాష్ అనిపించుకొని స్టార్ హోదా తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఈ మద్య కొంత మంది హీరో, హీరోయిన్లు మాత్రం నైట్ నైటే స్టార్ హోదా తెచ్చుకుంటున్నారు. ఒకటీ రెండు సినిమాల హిట్ తోనే అగ్ర హీరో, హీరోయిన్ల స్థాయికి ఎదిగిపోతున్నారు.
అలాంటి వారిలో మళియాళ భామ కీర్తి సురేష్. తెలుగు లో ‘నేను శైలజ’సినిమాతో ఎంట్రీ ఇచ్చి తర్వత ‘నేను లోకల్’ తో మంచి మార్కులు కొట్టేసింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’తో స్టార్ డమ్ సంపాదించింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రాజమౌళి మల్టీస్టారర్ సినిమాపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అని అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా అలా ఉంటుంది.. ఇలా ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఒక హీరోయిన్ ఖరారైందని వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ తెలుగు లో పవన్ కళ్యాన్ సరసన నటించిన తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ‘మహానటి’ హిట్తో తెలుగింటి అమ్మాయి అయిపోయింది. అయితే రాజమౌళి మల్టీస్టారర్లో కీర్తి సురేష్ నటిస్తోందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఆమె పాత్ర ఫైనల్ అంటున్నారు. కానీ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరిలో ఎవరి సరసన కీర్తి నటిస్తుందో తెలీదు. చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేస్తే తప్ప దీనిపై స్పష్టతరాదు. ఆ మద్య రకుల్ ప్రీతిసింగ్, రాశీ ఖన్నా, పూజా హెగ్డే, అనూ ఇమ్మానుయేల్ ఇలా ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా ఉన్న అందరి పేర్లు వైరల్ అయ్యాయి. కానీ రాజమౌళి దృష్టి మాత్రం కీర్తి సురేష్ పైనే ఉన్నట్లు తెలుస్తుంది.