ఎస్.ఎస్ రాజమౌళి డైరక్షన్ లో మెగా నందమూరి కాంబినేషన్ లో వస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీపై రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్నా ఈ సినిమా అక్టోబర్ నుండి మొదలు కాబోతుందని తెలిసిందే. 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ లో మొదట ఎన్.టి.ఆర్ పాల్గొంటాడట.  


చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారరే అయినా ఎన్.టి.ఆర్ మాత్రమే ముందు ఈ సినిమా సెట్స్ లో అడుగుపెడతాడట. ఆ తర్వాత చరణ్ పోర్షన్ షూట్ చేస్తారట. ఇద్దరు ఈ సినిమాలో కలిసి సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా నటిస్తారని టాక్.


గ్యాంగ్ స్టర్ లుక్ కోసం ఎన్.టి.ఆర్ ఇప్పటికే ఫిట్ గా మారాడు. సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, రష్మిక మందనను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. బాహుబలి సినిమాలానే తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తారట. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వనని రాజమౌళి ముందే చెప్పాడు.


కచ్చితంగా ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎన్.టి.ఆర్ తో మూడు, చరణ్ తో ఒక సినిమా తీసి హిట్ అందుకున్న రాజమౌళి ఈ మల్టీస్టారర్ ను అంచనాలను అందుకునేలా తెరకెక్కి మెగా నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా చేస్తారని ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: