ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం వివివినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న బాలయ్య తర్వాత బోయపాటి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు. ఆ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే క్రిష్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకొని త్వరలో షూటింగ్ మొదలు పెడతారని ఫిలివర్గాల్లో చర్చించుకుంటున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ అంటే భారీ స్థాయిలో తారాగణం ఉండాలి..అందులోనూ ఆయన పొలిటికల్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు కనుక రాజకీయ నేపథ్యం కూడా చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే నటీ,నటుల వేటలో పడ్డారు క్రిష్. అయితే సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య, చంద్రబాబు పాత్రలో రానా, ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ఇండస్ట్రీలో బాలకృష్ణ - నాగార్జున మధ్య ఉన్న సంబంధాలు అంతంతమాత్రమే అని ఫిల్మ్ నగర్ జనాలు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు. ఓ అవార్డు ఫంక్షన్లో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అవి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఓ టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయంపై ఒకసారి నాగార్జున మాట్లాడుతూ..అబ్బే బాలయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. కానీ ఒక్కసారి సారి వచ్చిన గాసిప్పులు వస్తే..అవి అంత సులభంగా మర్చిపోరు. ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చున ఓ విషయం జరిగింది.
`ఎన్టీఆర్` బయోపిక్తో బాలయ్య బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్టార్లని తీసుకొచ్చి.. కొత్త కళ తీసుకురావాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఏఎన్నార్ పాత్ర కోసం బాలయ్య నాగార్జునని సంప్రదించారని సమాచారం. కానీ నాగ్ మాత్రం సున్నితంగా `నో` చెప్పారని టాక్. కాకపోతే నాగార్జున నో చెప్పినా..ఆ పాత్ర నాగచైతన్య దగ్గరకు వెళ్లిందని, ఇప్పుడు నాగచైతన్య కూడా ఏఎఎన్నార్ పాత్ర చేయడానికి సిద్ధంగా లేడని, చైతూ స్థానంలో సుమంత్ని తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.