తెలుగు బుల్లి తెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో పరిచయం అయిన షకలక శంకర్ అతి తక్కువ కాలంలో మంచి కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. బుల్లితెరపై కాకుండా వెండి తెరపై కూడా కమెడియన్ గా సక్సెస్ సాధించాడు. తాజాగా షకలక శంకర్ హీరోగా ‘శంబో శంకర్’చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ లో షకలక శంకర్ బిజీగా ఉన్నాడు.
రీసెంట్ గా ఓ కార్యక్రమంలో త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజ లపై సంచల వ్యాఖ్యలు చేసిన షకలక శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను ఈ మద్య చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వచ్చాయని..షకలక శంకర్ కి షార్ట్ టెంపర్ ఎక్కువ అని అందుకే ఏది పడితే అది వాగుతాడని వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తూ ఉంటుంది.
నేను ఎవరిమీద కోప్పడ్డానో మీరే చెప్పండి .. ఒక్కళ్ల పేరు చెప్పినా నాకు షార్ట్ టెంపర్ అని ఒప్పేసుకుంటాను. ఎదుటివాళ్ల ధోరణి బాధను కలిగించినప్పుడు .. వాళ్లకి కాస్త దురుసుగా సమాధానమిస్తానేమోగానీ, వెంటనే రియాక్ట్ కావడం .. కోపంతో మీదపడిపోవడం చేయను. ఎవరైతే బాధ పెడుతున్నారో .. అది కరెక్ట్ కాదని వాళ్లకి చెప్పేస్తాను. అది నా బాధ్యతగా .. ధర్మంగా భావిస్తాను. అందువలన నేను కొంతమందికి షార్ట్ టెంపర్ మనిషిగా కనిపించి ఉండొచ్చు" అని చెప్పుకొచ్చాడు.