టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ అయిన తెలుగు బిగ్ బాస్ షోలో రెండవ సీజన్ మొదలైంది. ఈ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ సీజన్ లో ఎన్టీఆర్ కి వచ్చిన క్రేజ్ నానికి మొదటి వారంలో రాలేదు..కానీ సెకండ్ వీక్ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లో ఇద్దరు కామన్ మాన్ ఎలిమినేట్ కావడం..ఒక్కసారే కంటెస్టంట్ల మద్య గొడవలు రావడం..నానీ వీక్ ఎండ్ లో కాస్త సీరియస్ కావడం ఇలా బిగ్ బాస్ పై కాస్త ఆసక్తి పెంచుతూ వస్తున్నారు. అయితే టీఆర్పీ విషయంలో మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ కాస్త వెనుకబడి ఉందట.
ఇక కంటెంట్ గ్లామర్ ఎంటర్టైన్మెంట్ అన్ని సమపాళ్లలో పంచిస్తున్న కాంటెస్టెంట్ మాత్రం తేజస్వి మాదవిడ ఒక్కటే అని చెప్పుకోవచ్చు. దాంతో ఈ అమ్మడు ఏలిమినేషన్ జోన్ లోకి వచ్చిన తనకు వోట్ చేయవలసిందిగా ఆమె ట్విట్టర్ నుండి పోస్టులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదేంటీ బిగ్ బాస్ హౌజ్ లో ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్త ఉండదు కదా..అలాంటపుడు ట్విట్టర్ లో షేర్ చేయడం ఏంటీ అన్న ప్రశ్నలకు తలెత్తుతున్నాయా..ఇక్కడే తేజస్వి తన తెలివి చూపించింది.
ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే ముందే తన ట్విట్టర్ అకౌంట్ ను ఒక ఏజెన్సీ చేతిలో పెట్టి వెళ్ళింది. తేజస్వికి వోట్ వేయమని ప్రేక్షకులను కొరడమే ఆ ఏజెన్సీ పని అన్నమాట. తేజస్వి ఎలిమినేషన్ జోన్ లో ఉంది కాబట్టి వారి పని మొదలైంది. గ్రూప్ గా అయినా సింగల్ గా అయినా అందరిలోనూ ప్రతి దాన్లో తన బెస్ట్ ఇస్తున్న కాంటెస్టెంట్ తేజస్వి.
ఆమె వ్యక్తిత్వాన్ని మరింత తెలుసుకోవడం కోసం వోట్ చేయండి" అంటూ ఆ ఏజెన్సీ వారు తేజస్వి ట్విట్టర్ నుండి ట్వీట్లు పెడుతున్నారన్నమాట. మొత్తానికి తేజస్వి సోషల్ మీడియాను ఎంత బాగా వినియోగించుకుంటుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు.