తెలుగు ఇండస్ట్రీలోకి ముకుంద చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి ‘ఒక లైలా కోసం’ చత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో పూజా చాలా సాంప్రదాయంతో ఎలాంటి గ్లామర్ కి చోటు ఇవ్వకుండా నటించడంతో తర్వాత పెద్దగా ఛాన్స్ లు రాలేదు. దాంతో అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం' బికినితో రెచ్చిపోయింది.
హాట్ హాట్ అందాలు విచ్చలవిడిగా చూపించింది..దాంతో ఈ అమ్మడిని కుర్రాళ్లకు మతులు పోయాయి. అంతే..ఒక్కసారే స్టార్ తిరిగిపోయింది..వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఈ మద్య రంగస్థలంలో రాంచరణ్ తో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ల సరసన చాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె మహేశ్ బాబు 25వ సినిమా షూటింగులో బిజీగా వుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగు 'డెహ్రాడూన్'లో జరుగుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే 'వీడియో గేమ్ డెవలపర్' గా కనిపిస్తుందనేది తాజా సమాచారం.
ఈ సినిమాలో ఆమెను మరింత గ్లామరస్ గా చూపించనున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.