మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ మూవీ కోసం పడుతున్న కష్టాల పై ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ప్రస్తుతం ఈసినిమా కోసం చిత్రీకరిస్తున్న భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో చిరంజీవి తెల్లవారుఝామున 3 గంటల వరకు పడుతున్న  కష్టాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆ పత్రిక తన కథనంలో వివరించింది. 
Chiranjeevi's Sye Raa Narasimha Reddy starts shooting
గత కొద్దిరోజులుగా దాదాపు 40 మంది ఫైటర్స్ ను లండన్ నుండి రప్పించి చిరంజీవితో కలిపి చిత్రీకరిస్తున్న ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరణ కోసం 40 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ‘సైరా’ మూవీలో ఇంటర్వల్ ముందు రాబోయే ఈసన్నివేసం అత్యంత కీలకం కావడంతో ఈ సీన్ కోసం ఇంత భారీ స్థాయి మొత్తాన్ని ఖర్చు పెడుతున్నట్లు జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. 
tamanna role in sye raa movie
ఈ సీన్ చిత్రీకరణ కోసం చిరంజీవి తెల్లవారుఝామున మూడు గంటల వరకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో చిరంజీవి ఆ బ్రిటీష్ ఫైటర్స్ తో చేస్తున్న ఫైట్ సీన్స్ చూసి ఈ సినిమా యూనిట్ వర్గాలు ఆశ్చర్య పోతున్నట్లు టాక్.ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న సురేంద్ర రెడ్డి ముఖంలో అలసట కనిపిస్తోంది కాని అర్దరాత్రి దాటినా చిరంజీవి ముఖంలో అలసట లేకపోవడం చూసి అందరూ ఆశ్చర్య పోవడమే కాకుండా చిరంజీవి ఎనర్జీ పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం. 
చిరంజీవి
ఈసినిమాలో నయనతార తమన్నాలతో పాటు మరి కొంతమంది హీరోయిన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. రజినీకాంత్ ‘కాలా’ సినిమాలో హీరోయిన్ గా నటించిన హూమా ఖురేషి ని ఈసినిమాలో మరొక కీలక పాత్రకు ఎంపిక చేసినట్లు టాక్. ఆనాటి రోజులలో రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నిజామ్ భార్యగా ఈమె కనిపిస్తుందని తెలుస్తోంది. బ్రిటీష్ స్టంట్ డైరెక్టర్ ‘స్కైఫాల్’ మూవీ ఫేమ్ గ్రెగ్ పొవెల్ డిజైన్ చేస్తున్న ఫైట్స్ ఈమూవీని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళతాయని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: