నందమూరి బాలకృష్ణ తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ తేజ డైరక్షన్ నుండి క్రిష్ చేతుల్లోకి వచ్చింది. ఎన్.బి.కే ప్రొడక్షన్స్ లో బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటుగా ఏయన్నార్, కృష్ణ పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తుంది. అందుకే ఏయన్నార్ గా నాగార్జున.. కృష్ణ పాత్రలో మహేష్ ను తీసుకోవాలని చూస్తున్నారు.  


ఇప్పటికే క్రిష్ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాక ఏయన్నార్ నిడివి పెంచారని టాక్. ఇక కృష్ణ పాత్రలో మహేష్ తప్పనిసరిగా కావాల్సిందే అని స్వయంగా మహేష్ కు బాలయ్య బాబే ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తుంది. మహేష్ కూడా తండ్రి పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పాడని అంటున్నారు.


అయితే నాగార్జున మాత్రం ఏయన్నార్ గా కనిపించడానికి నో అని చెప్పాడట. ఏయన్నార్ గా మళ్లీ నాగ చైతన్యనే తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే నాగార్జున ఏమో కాని ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మహేష్ ఉంటాడని తెలియగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. 


తప్పకుండా ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య బాబు 60 గెటప్పులలో ఈ సినిమాలో కనిపిస్తారట. 2019 సంక్రాంతి టార్గెట్ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. అయితే సంక్రాంతికి మహేష్ 25వ సినిమా కూడా రిలీజ్ ప్లాన్ చేశారట.   



మరింత సమాచారం తెలుసుకోండి: