ఈ మద్య స్టార్ చిత్రాలకు సంబంధించి ఏ విషయంమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నారు. ఎన్టీఆర్ బాల్యం .. సినీరంగ ప్రవేశం .. రాజకీయ రంగప్రవేశం ఇవన్నీ ఉండబోతున్నాయట.
దాంతో ఈ చిత్రం నిడివి ఎక్కువ ఉంటుంది కనుక రెండు భాగాలు తీస్తున్నట్లు వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ , కృష్ణ పాత్రలో మహేష్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ పై చిత్ర యూనిట్ స్పందించారు. ఈ చిత్రం రెండు భాగాల్లో రావడం లేదని... ఎన్టీఆర్ బయోపిక్ మొత్తం ఒక సినిమాగానే ఉంటుందనీ .. జూలై 5వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని వాళ్లు అన్నారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని స్పష్టం చేశారు.