నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో క్రిష్ దర్శకత్వంలో త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి అన్నీ అరిష్టాలే ఎదురవుతున్నాయి. మొదట ఈ సినిమా దర్శకుడిగా తేజ పరిచయం అయ్యారు. మూహూర్తం షాట్ కూడా రెడీ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పకున్నారు. దాంతో బాలయ్య దర్శకుల గురించి బాలకృష్ణ ఎంతో మందిని సంప్రదించడం జరిగింది.
మొత్తానికి ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కి మరోకష్టం వచ్చిపడింది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘యన్.టి.ఆర్’. చిత్రంపై నాదెండ్ల కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సినిమా దర్శకుడు క్రిష్, నటుడు బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించ ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు.
ఇటీవలే గ్రాండ్గా ఈ సినిమాను స్టార్ట్ చేసిన బాలకృష్ణ, సినిమా రిలీజ్కు కూడా స్పెషల్ డేట్ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అంతే కాదు వచ్చే నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ అని కూడా వార్తలు వచ్చాయి. ఇది ఓ ప్రముఖ వ్యక్తి చరిత్ర.
అయితే, ఆనాటి ఆ పరిస్థితుల్లో తానే అన్యాయమైపోయానని చెబుతుంటారు నాదెండ్ల. ఇక, ఆ ఎపిసోడ్ సినిమాలో వుంటుందా.? అన్న విషయమై నాదెండ్ల అండ్ కో కొంత ఆందోళన చెందుతున్నట్టున్నారు. ఈ క్రమంలోనే, 'ఎన్టిఆర్' సినిమా పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, నోటీసులు పంపారని అర్థం అవుతుంది. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. నెగటివ్ షేడ్లో భాస్కరరావును చూపించే ప్రయత్నం చేస్తునట్టు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు.