భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేస్తున్న సినిమా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా మహేష్ కెరియర్ లో 25వది అందుకే కొత్త లుక్ కూడా ట్రై చేస్తూ సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.


మహేష్ స్టూడెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో రైతుల కష్టాల నేపథ్యంతో సినిమా నడుస్తుందట. ఇక గడ్డం లుక్ లో మహేష్ ఇప్పటికే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వగా లేటెస్ట్ గా షూటింగ్ స్పాట్ నుండి తన జిమ్ ట్రైనర్ తో కలిసి దిగిన పిక్ తో మహేష్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. 


ఈ పిక్ లో కూడా గడ్డంతో మహేష్ అదరిపోయాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్న ఈ సినిమా తప్పకుండా సంచలన రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. భరత్ తర్వాత కెరియర్ లో కొత్త జోష్ కనబరుస్తున్న మహేష్ 25వ సినిమా తన కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారట. 


సినిమా టైటిల్ గా రాజసం అని పెడుతున్నట్టు తెలుస్తుంది. బడా నిర్మాతలైన దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి ఈ సినిమా నిర్మించడం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ కోసం ఓ క్రేజీ హీరోయిన్ ను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.  



మరింత సమాచారం తెలుసుకోండి: