హీరోగా తనని దాదాపు మర్చిపోయారని అనుకున్న రాజశేఖర్ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన పిఎస్వి గరుడవేగ సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటో చాటుకున్నారు. రాజశేఖర్ కంబ్యాక్ మూవీగా గరుడవేగ మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ తర్వాత వెంటనే మరో సినిమా చేస్తారని అనుకుంటే లేట్ అయ్యింది.


కొన్నాళ్లుగా కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ ఫైనల్ గా తన తర్వాత సినిమా డైరక్టర్ ను ఫిక్స్ చేశాడు. షార్ట్ ఫిలింస్ చేస్తూ దర్శకుడిగా అ! సినిమాతో తనకంటూ ఓ బలమైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ వర్మతోనే రాజశేఖర్ తన తర్వాత సినిమా చేస్తున్నారట.


ఈ విషయాన్ని రాజశేఖర్ తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించడం జరిగింది. అద్భుతమైన కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ రాజశేఖర్ ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ క్వీన్ రీమేక్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక రాజశేఖర్ సినిమా చేసే అవకాశం ఉంది.


తెలుగు క్వీన్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మరి రాజశేఖర్ తో ప్రశాంత్ వర్మ సినిమా ఎలా ఉంటుంది. ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమాలానే ఇది కూడా ప్రయోగం చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: