ఓ పక్క సినిమాల ఫలితాలు తేడా కొట్టేయడంతో డీలా పడ్డ నాగార్జునకు మేనళ్లుడు సుమంత్ ఇచ్చిన షాక్ మరింత దెబ్బ కొట్టేలా చేస్తుందని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరో అయిన సుమంత్ ఎందుకు నాగార్జునకు దెబ్బేస్తాడని అంటే.. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించడమే కారణమని అంటున్నారు.


సుమంత్ నటిస్తే నాగార్జునకి ఏంటి నష్టం.. ఆయన చేసేది ఏయన్నార్ రోల్ కాబట్టే నాగార్జునకు దిగులు పట్టుకుంది. బాలకృష్ణతో వివాదాల కారణంగా ఆ సినిమాలో నాగార్జున నటించేందుకు ఇష్టపడలేదు. మహానటిలో నాగ చైతన్య అక్కినేనిగా నటించాడు. నాగ్ నో చెప్పడంతో చైతు కూడా సారీ అనేశాడు.


అయితే వీరిద్దరి కన్నా సుమంత్ అయితే ఏయన్నార్ గా పర్ఫెక్ట్ అనుకున్నాడట క్రిష్. అందుకే వెంటనే సుమంత్ ను కలవడం ఏయన్నార్ గా ఓకే చేయడం జరిగిందట. తాతంటే చాలా ఇష్టం ఉన్న సుమంత్ తాత పాత్ర్లో నటించేందుకు ఎక్సైటింగ్ గా ఉన్నాడు. అయితే అది నాగార్జున సమ్మతంతోనేనా కాద అన్నది తెలియాల్సి ఉంది.


ఈమధ్య మళ్లీ రావా సినిమాతో కొత్త సుమంత్ కనిపించాడు. ఆ సినిమా హిట్ ఇచ్చిన జోష్ తో ఇదం జగత్ అంటూ కొత్త సినిమాతో వస్తున్నాడు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. చూస్తుంటే సుమంత్ తన కెరియర్ గాడిలో పెట్టేలా కనిపిస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: