ఈ టూర్ లో భాగంగా అక్కడికి వెళ్లిన జాక్వెలిన్, కత్రినాలు ఒకరికొకరు ఎదురుపడటానికి సైతం ఇష్టపడటం లేదని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్తో కత్రినా ఇంతకు ముందు ప్రేమాయణం నెరిపిన విషయం తెలిసిందే. కొంత కాలం తర్వాత వీరి ప్రేమాయణం బెడిసి కొట్టింది. చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి టైగర్ జిందా హై అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఈ పాత ప్రేమికులు పంతం వీడి స్నేహ పూర్వకంగా ఉంటూ వస్తున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరిలో కన్నా కత్రీనాకే ఎక్కువ పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్ల మద్య టూర్ ప్రారంభంలోనే ఇంతటి ఘర్షణ వాతావరణం వుంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులను చూడాల్సివస్తుందోనని నిర్వహకులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే..ఈ టూర్కు వీరితో పాటు సోనాక్షి సిన్హా, మనీశ్ పాల్లు కూడా వెళ్లారు. కత్రినా, జాక్వలిన్ల మధ్య అంతరాయలను గమనించిన సల్మాన్ వీరిద్దరు ఒకరికొకరు తారసపడకుండా చూడాలని ఇతర టీమ్ సభ్యులకు సూచించారు. హోటలల్లో కూడా కత్రినా, జాక్వలిన్లకు కేటాయించే రూమ్లు దూరంగా ఉండేలా వారు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.