సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది పోలీస్ పాత్రల్లో నటించారు..కానీ కొద్ది మాత్రమే గుర్తుండిపోయేలా నటించారు.  అలాంటి వారిలో ‘అంకుశం’సినిమాతో డాక్టర్ రాజశేఖర్ పవర్ ఫుల్ గా నటించి యాంగ్రీ యంగ్ మేన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆవేశపూరితమైన నటనకు సాయి కుమార్ గంభీరమైన వాయిస్ తోడయి..అప్పట్లో రాజశేఖర్ సినిమాంటే ప్రత్యేక ఆకర్షన ఏర్పడింది.  తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటిస్తూ వచ్చారు.  తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాజశేఖర్. 

ఆ మద్య వరుసగా సినిమాలు అపజయాలు కావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు.  చాలా సంవత్సరాల తర్వాత పిఎస్వీ గరుడ వేగా సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు హీరో రాజశేఖర్. గతేడాది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ కు ఈ సినిమాతో ఓ విజయం అందింది. నటుడిగా తన స్టామినా ఏంటో చూపించారు.  అయితే గరుడవేగ సినిమా రాక ముందు రాజశేఖర్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని..తెలుగు, తమిళ, మళియాళ  భాషల్లో ఆయన విలన్ పాత్రల్లో మెప్పించబోతున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి.

కానీ గరుడవేగ సినిమా తర్వాత ఆయన హీరోగా మరి కొన్ని సినిమాల్లో నటిస్తానని చెప్పడం విశేషం.  ఈ నేపథ్యంలో కథ ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. పలు కథలు విన్న తర్వాత రాజశేఖర్ ఓ కథను అంగీకరించాడు. ఈ సందర్భంగా రాజశేఖర్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించారు.

'నా తర్వాతి సినిమా అదే నాని చెప్పడానికి సంతోషిస్తున్న అది ఎలా ఉంటుందంటే.... ఆ!ద్భుతంగా ఉంటుంది' అని ట్విట్ చేశారు.తన తర్వాతి సినిమా AWEsome అంటూ పేర్కొన్న అయన మొదటి మూడు అక్షరాలను ప్రత్యేకంగా రాయడం వెనుక దర్శకుడు ఎవరో చెప్పకనే చెప్పేశారని అంటున్నారు పరిశ్రమ వర్గాలు.  అతనే యువ దర్శకుడు ప్రశాంత వర్మ. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: