మహానటి సినిమా తర్వాత బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. జీవిత చరిత్రను సినిమా చెప్పే ప్రయత్నంలో అవి డాక్యుమెంటరీగా కాకుండా మహానటి మూవీ గొప్ప విజయం సాధించింది. ఇక ఆ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో సెట్స్ మీద ఉన్న ఎన్.టి.ఆర్, యాత్ర బయోపిక్ సినిమాలకు క్రేజ్ పెరిగింది.


ఎన్.టి.ఆర్ బయోపిక్ లో బాలకృష్ణ లీడ్ రోల్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దాదాపుగా బాలయ్య 60 గెటప్పులలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో రానా, మహేష్, సుమంత్ లాంటి వారు భాగమవుతున్నారని తెలుస్తుంది. విద్యా బాలన్ కూడా బసవతారకమ్మ పాత్రలో నటిస్తుందట.


మరో పక్క యాత్రగా వైఎస్సర్ బయోపిక్ సెట్స్ మీద ఉంది. మహి వి రాఘవ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వై.ఎస్ పాత్రలో మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. వై.ఎస్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న ఈ యాత్ర మూవీలో బుల్లితెర క్రేజీ యాంకర్ ముద్దుగుమ్మ అనసూయ నటిస్తుందని తెలుస్తుంది.


కర్నూల్ నుండి పొటీ చేసే ఓ పొలిటిషియన్ పాత్రలో అనసూయ నటించనుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. రంగస్థలంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ వైఎస్సార్ బయోపిక్ లో ఛాన్స్ కొట్టేయడం లక్ అనే చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: